సాయి పల్లవి, రానా కాంబినేషన్ లో వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం.దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ నక్షల్స్ పోరాటం నేపధ్యంలో తెలుగులో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.
ఆర్ నారాయణమూర్తి, దాసరి నారాయణరావు కొంతకాలం నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో విప్లవ కథలని తెరకెక్కించారు.టాలీవుడ్ లో కొన్నేళ్ళ పాటు విప్లవ కథల ట్రెండ్ నడిచింది.
అయితే తరువాత ఆ జోనర్ ని నేటితరం దర్శకులు పూర్తిగా పక్కన పెట్టేశారు.అయితే విప్లవ భావాలు కలిగి ఉన్న రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ఊడుగుల విరాటపర్వం సినిమాతో మరోసారి ఆ జోనర్ ని టచ్ చేస్తున్నారు.ఇప్పటికే ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంది.90వ దశకంలో తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఈ కథని ఆవిష్కరించినట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
ఇక ఈ కథ నేరేషన్ అంతా సాయి పల్లవి క్యారెక్టర్ పాయింట్ అఫ్ వ్యూ నుంచి నడుస్తుంది.ఇదిలా ఉంటే కరోనా సెకండ్ వేవ్ లేకుండా ఉంటే ఇప్పటికే ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది.
అయితే ఈ కరోనా ప్రభావంతో వాయిదా పడింది.ఇదిలా ఉంటే ఈ మూవీకి ఒటీటీ ఛానల్స్ నుంచి మంచి ఆఫర్ వచ్చిందని, ఈ నేపధ్యంలో సినిమాని డిజిటల్ రిలీజ్ చేయడానికి నిర్మాతలు మొగ్గు చూపిస్తునారని టాక్ వచ్చింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ టాక్ పై నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.విరాటపర్వం మూవీని ఎట్టి పరిస్థితిలో ఒటీటీ రిలీజ్ చేసే ఛాన్స్ లేదని, డైరెక్ట్ గా థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
ఇలాంటి మంచి చిత్రాన్ని థియేటర్ లో చూస్తేనే బాగుంటుందని తెలిపారు.