సంపత్ నంది( Sampath Nandi ) దర్శకత్వంలో హీరోయిన్ తమన్నా( Tamanna ) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ఓదెల 2.( Odela 2 ) ఈ సినిమాను మధు అనే కొత్త నిర్మాత నిర్మించగా, ప్రమోషన్స్ తో సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి.
కరోనా సమయంలో ఓటీటీ లో రిలీజ్ అయిన ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందించారు.ప్రమోషన్స్ ఆసక్తికరంగా ఉండడం, సినిమా కంటెంట్ కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా అనిపించడంతో, సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు.
అయితే ఎదురు చూపులు ఫలించాయి.ఈ సినిమా నేడు అనగా ఏప్రిల్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.మరి ఈ మూవీ ఎలా ఉంది? కథ ఏమిటి? అన్న విషయానికి వస్తే.
కథ:
రైల్వే స్టేషన్ కథ ముగిసినప్పటి నుంచి మొదలవుతుంది ఓదెల 2 కథ. ఊరిలో ఎంతో మంది కొత్తగా పెళ్లి అయిన ఆడవాళ్లను శోభనం రాత్రి రేప్ చేసి చంపేస్తున్న తన భర్త తిరుపతి (వశిష్ట సింహ)ను రాధా (హెబ్బా పటేల్) తల నరికి చంపేస్తుంది.దీంతో ఆమె జైలు పాలవుతుంది.
అయితే ఊరివాళ్లందరూ కలిసి తిరుపతికి సమాధి బంధం అనే శిక్ష విధిస్తారు.ఈ క్రమంలో తిరుపతి ఆత్మ ప్రేతాత్మగా మారుతుంది.
ఊరిలో మళ్లీ పెళ్లయిన ఆడవాళ్ల శోభనం రోజు రాత్రి వారిని రేప్ చేసి చంపేస్తున్న ఘటనలు మొదలవుతాయి.

అయితే దానికి కారణం ఊరి పూజారి శ్రీకాంత్ అయ్యంగార్,( Srikanth Iyengar ) మయన్న అని అనుకుని వాళ్లను శిక్షించడానికి సిద్ధమైతే, తిరుపతి ఆత్మ కారణమని చెబుతాడు ఊరిలో తాయత్తులు వేసే అల్లా భక్షు (మురళీ శర్మ) ఈ సమస్య నుంచి కాపాడాలని మళ్లీ రాధను కోరతారు.ఇది నా వల్ల కాదని, తన అక్క, ఇప్పుడు అఘోరీగా మారిన భైరవి (తమన్నా)( Bhairavi ) వల్లే కుదురుతుందని చెప్పి పంపడంతో, ఆ ఊరివాళ్లు ఆమెను వెనక్కి తీసుకుని వస్తారు.మరి ఊరిని తిరుపతి బారి నుంచి భైరవి కాపాడిందా? రాధ ఎలా మరణించింది? చివరికి ఏమైంది? ఈ విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
నిజానికి ఈ సినిమా కథ ఏమిటన్న విషయం ప్రమోషన్స్ సమయంలో అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది.ఆడపిల్లల మీద పడి, రేప్ చేస్తూ చంపేస్తున్న మొగుడిని రాధ తల నరికి చంపేస్తుంది.ఆ తర్వాత, అతనికి ఊరు విధించిన శిక్ష కారణంగా అతను ప్రేతాత్మగా మారతాడు.ఆ ప్రేతాత్మ తర్వాత ఎలాంటి దారుణాలకు తెగబడింది? అనే విషయాల చుట్టూ ఈ సినిమాను చాలా ఆసక్తికరంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.ఇక ఆద్యంతం కథను నడిపించిన తీరు ఆసక్తికరంగా ఉందని చెప్పాలి.అలాగే సినిమాలో ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులను పెద్దగా ఆశ్చర్యానికి గురి చేయదు.
కేవలం కథను బిల్డ్ చేసుకునేందుకు ఫస్ట్ హాఫ్ మొత్తం తీసుకున్నాడు దర్శకుడు.అయితే తమన్నా ఎంట్రీ మొదలైనప్పటి నుంచి సినిమా మీద ప్రేక్షకులలో ఒక్కసారిగా ఆసక్తి పెరుగుతుంది.
తమన్నా ఎంట్రీ, ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్రేక్షకులను అబ్బురపరుస్తాయని చెప్పాలి.ఇక ప్రేతాత్మతో పోరాడే సన్నివేశాలు కాస్త రొటీన్ గా అనిపిస్తాయి.
కానీ, క్లైమాక్స్ రాసుకున్న తీరు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.

నటీనటులు పనితీరు:
ఇకపోతే నటీనటుల నటన విషయానికి వస్తే.ఈ సినిమాలో నాగ సాధు అఘోరీగా( Naga Sadhu Aghori ) నటించిన తమన్నా తన లైఫ్టైమ్ లో బెస్ట్ రోల్ పట్టేసిందని చెప్పాలి.ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలతో ఆకట్టుకున్న ఆమె, ఈ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించే అవకాశం దక్కించుకుంది.
కొన్ని సీన్స్ లో తమన్నా నటన, ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి.ఇక తిరుపతి అనే ఆత్మగా మారిన వ్యక్తిగా వశిష్ట సింహ కూడా ఇరగదీశాడని చెప్పాలి.
అలాగే ప్రేతాత్మగా అందరినీ భయపెట్టే ప్రయత్నం చేశాడు.ఇక హెబ్బా పటేల్ నటన గురించి మాట్లాడకుండా ఉంటే మంచిది.మిగిలిన నటినటులు కూడా ఎవరి పాత్రల పరిధి మేరకు వారు బాగానే నటించారు.
సాంకేతికత:
సినిమా డైలాగ్స్ విషయంలో సంపత్ ని అభినందించకుండా ఉండలేము.కెమెరా వర్క్స్ కూడా బాగున్నాయి.అలాగే కథనం విషయంలో ఆయన తీసుకున్న జాగ్రత్త చాలా చోట్ల కనిపించింది.ఈ సినిమాకు తెరమీద హీరో తమన్నా అయితే, తెరవెనుక హీరో అజనీష్ లోకనాథ్.అజనీష్ ఇచ్చిన సంగీతంతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అల్టిమేట్ అని చెప్పాలి.మ్యూజిక్ కూడా బాగానే ఉంది.