కిష్టంపల్లి లో రెండవ రోజు వడ్లు చోరీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddipeta ) మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిష్టంపల్లి లో సింగిల్ విండో( Single window ) అధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రం లో నిన్న ఓ రైతు వడ్లు దొంగతనం జరగగా తాజాగా ఆదివారం కూడా నర్సయ్య అనే రైతుకు చెందిన సుమారు రెండు క్వింటాళ్ల కు పైగా వడ్లు చోరికి గురైనాయి.తేమ శాతం వచ్చినాయని సదరు రైతు వడ్లు ఒక్క దగ్గరికి కుప్ప చేయగా వచ్చి చూసేసరికి వడ్ల కుప్ప పై కప్పిన పరదా తీసి ఉండడం గమనించి లబోదిబో మంటున్నారు.

 Paddy Theft In Kishtampally On The Second Day , Paddy , Single Window System-TeluguStop.com


నైట్ పూట వాచ్ మెన్ నియమించాలని సింగిల్ విండో పాలకవర్గం ను కోరిన నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.అలాగే సెంటర్లో లైటింగ్ సిస్టం కూడా లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

పలుమార్లు సింగిల్ విండో వారికి కరెంటు ఏర్పాటు చేయండి అని రైతులు తెలిపారు.అయినా కానీ వాళ్ల నుండి ఎలాంటి స్పందన లేదని రైతులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube