ఎస్సీ స్టడీ సర్కిల్ ను పరిశీలించిన అదనపు కలెక్టర్

రాజన్న సిరిసిల్లలోని ఎస్సీ స్టడీ సర్కిల్ ను అదనపు కలెక్టర్ పూజారి గౌతమి( Collector Pujari Gautami ) మంగళవారం పరిశీలించారు.మూడు నెలల ఫౌండేషన్ కోర్సు మే 1 వ తేదీ నుంచి ప్రారంభించనున్న నేపథ్యంలో సిరిసిల్లలోని ఎస్సీ స్టడీ సర్కిల్ లో భోజన, హాస్టల్, వసతి ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

 Additional Collector Inspected Sc Study Circle, Collector Pujari Gautami, Sc Stu-TeluguStop.com

అనంతరం అదనపు కలెక్టర్ ఐదు నెలల ఫౌండేషన్ కోర్సు లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడారు.స్టడీ సర్కిల్ ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లి, లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు.మూడు నెలల ఫౌండేషన్ కోర్సు కోసం మొత్తం 50 మంది దరఖాస్తు చేసుకున్నారని, 28 మంది యువతులు, 22 మంది యువకులు ఉన్నారని, వారందరికీ హాస్టల్, భోజన, వసతి వేరువేరుగా కల్పించామని ఎస్సీ స్టడీ సర్కిల్ ఇంచార్జీ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు.

ఇప్పటికే 5 నెలల ఫౌండేషన్ కోర్సు కొనసాగుతుందని వివరించారు.ఇక్కడ ఎస్సీ స్టడీ సర్కిల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube