గిద్దె గళం గద్దర్ అవార్డు అందుకున్న ఎరుపుల దేవయ్య ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సెస్ ఎంప్లాయిస్ యూనియన్ లీడర్ కళాకారుడు ఎరుపుల దేవయ్య ” గిద్దె గళం గద్దర్ అవార్డు( Gidde Galam Gaddar Award ) ” అందుకున్న సందర్భంగా మంగళవారం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య ఆయనను ఘనంగా సన్మానించారు.

 Leaders Of The Congress Party Honored The Recipient Of The Gidde Galam Gaddar Aw-TeluguStop.com

ఈ సందర్భంగా దోమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ ఎరుపుల దేవయ్య ఎంప్లాయిస్ యూనియన్ లీడర్ గా కళాకారునిగా మంచి గుర్తింపు పొంది గిద్దె గళం గద్దర్ అవార్డు అందుకున్న శుభ సందర్భంగా ఆయనను అభినందించారు.

కళాకారునిగా రాణించి మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా దేవయ్య కు పూలమాలలు వేసి శాలువాలు కప్పి వారు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు ఏలూరి రాజయ్య , జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మిరి శెట్టి తిరుపతి , మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు గుండాడి వెంకట్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ నాయకులు సూడిది రాజేందర్ , బండారి బాల్ రెడ్డి, మెండే శ్రీనివాస్ యాదవ్, పందిళ్ళ సుధాకర్ గౌడ్ , కొన్నే పోచయ్య తదితరులు పాల్గొని దేవయ్య ను ఘనంగా సన్మానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube