చాకలి ఐలమ్మ విగ్రహ గద్దెను ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి ముస్తాబాద్ మండల రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహ గద్దెను శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ద్వంసం చేయడం జరిగింది.అట్టి విషయం తెలుసుకున్న జిల్లా రజక సంఘం అధ్యక్షులు దుబ్బాక రమేష్, రజక సంఘం నాయకులు, వెంటనే అక్కడికి చేరుకొని ఐలమ్మ విగ్రహం గద్దెను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, వారిని వెంటనే అరెస్టు చేయాలని పోతుగల్ గ్రామంలో ధర్నా చేసి ముస్తాబాద్ మండల్ పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఆడబిడ్డ భూమికోసం, భుక్తి కోసం, సాయుధ పోరాట వీర వనిత విగ్రహ గద్దెను ధ్వంసం చేయడం పిరికి పందల చర్య అని అటువంటి వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు దుబ్బాక రమేష్, రజక విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి సుద్దాల నరేష్ కుమార్,జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంపల్లి దేవయ్య మాడెల్ ,ఉపాధ్యక్షుడు బొల్లారం పరుశరాములు, జిల్లా సీనియర్ నాయకులు సుద్దాల దేవయ్య, చందుర్తి నరసయ్య, లింగంపల్లి గంగాధర్, మండల అధ్యక్షులు నారాయణ దీటి నర్సింహులు, సత్తయ్య, శరయ్య, యూత్ అధ్యక్షులు శ్రీకాంత్,దుబ్బాక శ్రీనివాస్, లింగంపల్లి అనిల్, జిల్లా అధికార ప్రతినిధి మైలారం, రాష్ట్ర కార్యదర్శి గొల్లపల్లి మల్లేశం, బాలమల్లు,వివిధ గ్రామాల మండలాల అన్ని గ్రామాల ప్రజలు రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.