ఈ మధ్యకాలంలో మనుషులకు కనికరం అనే పదానికి అర్థం లేకుండా పోతుంది.ఎదురుగా మనిషి ప్రాణాలతో విలువల్లాడుతున్న కొంతమంది మాత్రం అవన్నీ పట్టించుకోకుండా వారి పని వారు చూసుకోవడం సరిపోతుంది.
తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజినూర్ జిల్లాలో ( Bijinur district of Uttar Pradesh state )మానవత్వానికి కలంకం తెచ్చిన ఓ సంఘటన జరిగింది.ఓ మద్యం ట్రక్కు ప్రమాదం జరిగిన తర్వాత ఆ ట్రక్కు డ్రైవర్ కు గాయాలయ్యాయి.
అయినా కానీ ప్రజలు ఆయనను వదిలేసి రోడ్డుపై చల్లా చెదురుగా పడిన పద్యం సీసాలను దోచుకెళ్లిపోయారు.విదేశీ, స్వదేశీ రకాలుకు సంబంధించిన మద్యంను తీసుకెళ్తున్న మద్యం ట్రక్కు ఓ ఆవు వల్ల తక్కువ అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.
రోడ్డుపై తక్కువ డ్రైవర్ రక్తంతో ఉన్న పక్కన ప్రజలు సీసాలను తీసుకుపోయిన సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం పోస్టు మీడియాలో వైరల్ గా మారింది.
తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో మండవాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని నజీబాబాద్ హైవే ( Najeebabad Highway )వెంబడి జత్పురా బోండా ( Jatpura Bonda )గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది.ఈ సంఘటనలో మద్యం ట్రక్కు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో అదే సమయంలో పక్కనే వెళ్తున్న మరో గుర్తుతెలియని వాహనానికి ఢీ కొట్టింది.దీనికి కారణం రోడ్డుపై అకస్మాత్తుగా ఆవు రావడం ద్వారా దాన్ని తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ పక్కకు తిప్పడంలో వాహనం అదుపుతప్పి ఈ సంఘటన జరిగినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
ఇక్కడ దింతో మద్యం ట్రక్ లోని మద్యం సీసాలన్నీ రోడ్డుపై చెల్లచెదురుగా పడ్డాయి.ఈ నేపథ్యంలో అనేక సీసాలు కూడా ధ్వంసం అయ్యాయి.కాకపోతే వాటిలో కొన్ని సీసాలు మాత్రం బాగానే ఉన్నాయి.ఈ దుర్ఘటన జరిగిన తర్వాత సంఘటన స్థలానికి దగ్గరలో ఉన్న కొందరు ప్రజలు పగిలిపోని వాటిని తీసుకోని ప్రజలు అక్కడ నుంచి ఉడాయించారు.
ఈ సమయంలో రోడ్డుపై రక్తంతో ఉన్న డ్రైవర్ ని మాత్రం అసలు పట్టించుకోలేదు ప్రజలు.దీనితో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారంది.