రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల దేవక్కపేట అటవీ ప్రాంతంలో వెలసిన కొత్త మల్లన్న దేవాలయ నిర్మాణ అభివృద్ధి కోసం రుద్రంగి మండలకేంద్రానికి చెందిన దుబాయ్ ఎన్నారై, అద్నాన్ కార్ వాష్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత బొల్లి కుమార్ 25000/- రూపాయల విరాళాల చెక్కును మానాల గ్రామానికి చెందిన చిడబోయిన మహేష్, కోక్కుల వంశీ, దర్శనపు మహేష్ లకు అందించారు.
ఈ సందర్భంగా అద్నాన్ కార్ వాష్ కంపెనీ అధినేత బొల్లి కుమార్ మాట్లాడుతూ… కోరిన కొరికలు తీర్చే దేవుడిగా పేరు ప్రాఖ్యాతలు పొందిన కొత్త మల్లన్న స్వామి ఆలయ నిర్మాణానికి తనవంతుగా సహాయాన్ని అందించడం సంతోషంగా ఉందని,ఆలయ అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో మరింతగా కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో కోక్కుల వంశీ, చీడబోయిన మహేష్, దర్శనపు మహేష్ తదితరులు పాల్గొన్నారు.