కొత్త మల్లన్న దేవాలయ నిర్మాణ పనులకు ఎన్నారై విరాళం.!

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల దేవక్కపేట అటవీ ప్రాంతంలో వెలసిన కొత్త మల్లన్న దేవాలయ నిర్మాణ అభివృద్ధి కోసం రుద్రంగి మండలకేంద్రానికి చెందిన దుబాయ్ ఎన్నారై, అద్నాన్ కార్ వాష్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత బొల్లి కుమార్ 25000/- రూపాయల విరాళాల చెక్కును మానాల గ్రామానికి చెందిన చిడబోయిన మహేష్, కోక్కుల వంశీ, దర్శనపు మహేష్ లకు అందించారు.

 Nri Donation For Kottha Mallanna Temple Construction Works, Nri Donation ,kottha-TeluguStop.com

ఈ సందర్భంగా అద్నాన్ కార్ వాష్ కంపెనీ అధినేత బొల్లి కుమార్ మాట్లాడుతూ… కోరిన కొరికలు తీర్చే దేవుడిగా పేరు ప్రాఖ్యాతలు పొందిన కొత్త మల్లన్న స్వామి ఆలయ నిర్మాణానికి తనవంతుగా సహాయాన్ని అందించడం సంతోషంగా ఉందని,ఆలయ అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో మరింతగా కృషి చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో కోక్కుల వంశీ, చీడబోయిన మహేష్, దర్శనపు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube