రాజన్న సిరిసిల్ల జిల్లా :సి-విజిల్ యాప్( C-VIGIL app ) ద్వారా ప్రజలు తమ దృష్టికి వచ్చిన ఎన్నికల కోడ్ ఉల్లంఘనల పై ఫిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి( Anurag Jayanti ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఓటర్ లను మభ్య పెట్టేందుకు ఎవరైనా అక్రమంగా నగదు, మద్యం, ఇతర వస్తువులను పంపిణీ చేయడం, ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడే వాటిని లైవ్ ఫోటోలు, లైవ్ వీడియోలను సి – విజిల్ యాప్ ద్వారా తీసి పంపాలని తెలిపారు.
సి-విజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదుల పై వంద నిమిషాలలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని, లైవ్ ఫోటోలు, వీడియోలను తీసేటప్పుడు, అప్లోడ్ చేసే సమయంలో జి.పి.ఎస్.ఆన్ లో ఉంచాలని, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్( Geographic information ) ద్వారా లోకేషన్ నమోదు అవుతుందని, సభలు, సమావేశాల్లో విద్వేషపూరిత కామెంట్స్ చేసిన, పార్టీ అభ్యర్థులు పంచే డబ్బులు, మద్యం, బహుమతులు లాంటి వివరాలను, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించిన, ఇతర ఎన్నికల ఉల్లంఘనల పై లైవ్ ఫోటోలు, వీడియోలు సి – విజిల్ యాప్ ద్వారా పంపాలని సూచించారు.ప్రజలు సి-విజిల్ యాప్ ను తమ ఫోన్ లలో ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని తమ చుట్టుపక్కల జరుగుతున్న ఎన్నికల కోడ్ ఉల్లంఘనల ను అప్లోడ్ చేసి తమ దృష్టికి తీసుకుని రావాలని, 24 గంటలు కలెక్టరేట్ కార్యాలయంలో సి-విజిల్ యాప్ ఫిర్యాదులపై పర్యవేక్షణ చేయడం జరుగుతున్నదని, ఫిర్యాదు చేసిన వారి పేర్లను, సెల్ నెంబర్ లను గోప్యంగా ఉంచనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి ఈ ప్రకటనలో తెలిపారు.