బండి సంజయ్ రాజన్న గుడికి ఎన్ని నిధులు తెచ్చావు

ముంపు గ్రామాల గుండె చప్పుడు తెలిసిన వాడిగా మీకు తోడుగా ఉంటా ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్.రాజన్న సిరిసిల్ల జిల్లా: కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా గురువారం వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం, సంకెపల్లి గ్రామాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మే 13 న జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో రాజేందర్ రావు అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.

 How Many Funds Did You Bring To Bandi Sanjay Rajanna Temple , Bandi Sanjay Rajan-TeluguStop.com

నాలుగున్నర మాసాల క్రితం బీఆర్ఎస్ పక్కన పెట్టినట్లుగా బిజెపిని కూడా పక్కన పెట్టాలని,రాజన్న సాక్షిగా ముంపు గ్రామాల ప్రజలకు ఇచ్చిన మాటను కేసీఆర్ తప్పారు అని గుర్తు చేశారు.రాష్ట్రంలో బిఆర్ఎస్ పని అయిపోయిందని,పది సంవత్సరాలు అధికారంలో ఉండి బిఆర్ఎస్ వారు ఏనాడు కూడా ప్రజలను పట్టించుకోలేదన్నారు.

బిఆర్ఎస్ పాలనలో కేవలం వారి కుటుంబ సభ్యులు మాత్రమే బాగుపడ్డారన్నారు బండి సంజయ్ రాజన్నకు ఆణ పైసా అయిన తెచ్చావా, ప్రసాదం పథకం ద్వారా రాజన్న కు ఎన్ని నిధులు తెచ్చావు.బిజేపి వారు దేశంలో నిరుద్యోగం పెరిగేలా చేశారు, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారన్నారు .నిత్యవసర ధరలు పెంచి పేదవారి నడ్డి విరిచారని దుయ్య బట్టారు.దేశంలో 400 సీట్లు ఇవ్వాలని బీజేపి వారు అడుగుతున్నారు.

మూడో సారి బీజేపి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు రిజర్వేషన్లను రద్దు చేస్తుందన్నారు.మన ఓట్లుతో గెలిచిన బండి సంజయ్ ముంపు గ్రామాలకు ఎప్పడూ అయిన వచ్చావా?ముంపు గ్రామాల సమస్యల పై బండి సంజయ్ కు చిత్త శుద్ధి లేదన్నారు.ఎన్నికలప్పుడు వచ్చే వారు కాదు ఎన్నికలు ఉన్న లేకున్న వచ్చే వారిని ఆశీర్వదించండి.వినోద్ కుమార్ నాన్ లోకల్ అతను వరంగల్ జిల్లా వాసి.ముంపు గ్రామాల సమస్యలు పై మి గళం లో గలమెత్త, మీ పాదంలో పాదం కలిపిన వాడిగా మీ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తాంమన్నారు.గతంలో పీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి సంకపల్లి లో బస చేశారు.

మన సమస్యలు ముఖ్యమంత్రికి తెలుసు త్వరలోనే వాటికి పరిష్కారం చూపుతారని ముంపు గ్రామాల ప్రజలకు 5లక్షల 4వేయిలు ఇస్తామని,గత అసెంబ్లీ సమావేశాల్లో ముంపు గ్రామాల సమస్యలను ప్రస్తావించలేదన్నారు.ముంపు గ్రామాల సమస్యల పై వెనక్కి పోయే ప్రశ్నే లేదు ఉపాధి పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం,గతంలో జిల్లా కలెక్టర్ తో సమావేశంలో చర్చించాం.

మత్స్యకారులకు ఫిషరిష కల్చర్ ద్వారా ఉపాధి కల్పిస్తున్నాం, అణుపురం లో కుట్టు మిషన్ శిక్షణ ఇస్తున్నాం .మిలెట్ల తయారీ ద్వార ఉపాధి కల్పిస్తున్నాం.గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ వారు ముంపు గ్రామాల సమస్యలను పట్టించుకోలే, అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో సంకపల్లి లో 45 ఇండ్లకు గెజిట్ ఇప్పించాం, రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చాం దాని ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.3600 అధికారంలో ఉన్న బీజేపి వారు ప్రజలకూ ఏమి చెయ్యలేదు.బీజేపి, బిఆర్ఏస్ ప్రజలను మోసం చేసింది, పేదల గురించి ఆలోచించేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని దేశంలో పెదల కష్టాలు తెలుసుకోవడం కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు.పాంచ్ న్యాయ పేరిట సంక్షేమ పథకాలను అమలు చేస్తాం,బీజేపి వారు రాముడితో, అక్షింతలతో రాజకీయం చేస్తున్నది అని దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి, అయోధ్య రామాలయం పూర్తి కాక ముందే ఓట్ల కోసం అక్షింతలను పంచారు.

రాజేందర్ రావు మృదు స్వభావి, విద్యావేత్త గతంలో వినోద్ కుమార్ కు, బండి సంజయ్ కు అవకాం ఇచ్చారు.రాజేందర్ రావు కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.

జోడేద్దుల్లాగా పనిచేస్తాం మీ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాం మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తు పైవే సి రాజేందర్ రావును భారీ మెజారిటీతో గెలించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube