రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో లో పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు నిర్వహించారు.ఎల్లమ్మ సిద్యోగంలో భాగంగా మొదటి రోజు పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితి.
ఈ సందర్భంగా మహిళలు ఉపవాసంతో ఉంటూ,ఇంటికో బోనం నేత్తిన పెట్టుకొని, బైండ్ల పూజారుల విన్యాసాల మధ్య,శివసత్తుల పూనకాల మధ్య ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా యువకులు డప్పు చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ, పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు.
అనంతరం పోచమ్మ తల్లికి నైవేద్య సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం గౌడ కులస్తులు మాట్లాడుతూ గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పాడిపంట, పిల్లాపాపలందరూ బాగుండాలని వేడుకున్నట్లు తెలిపారు.