1.పవన్ చంద్రబాబుపై జగన్ విమర్శలు
టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ సీఎం జగన్ విమర్శలు చేశారు.ఈ ఇద్దరు నాయకులకు ఏపీలో ఇల్లు లేవని హైదరాబాద్ లోనే మకాం ఉంటూ ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.
2.చంద్రబాబు బైయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు 17 వ తేదీకి వాయిదా వేసింది .
3.జనసేనకు రాజీనామా
నెల్లూరు సిటీ లో జనసేన ను లీడ్ చేస్తున్న కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు .రేపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు.
4.విశాఖకు ఎలక్ట్రిక్ బస్సులు
విశాఖకు మరో మూడు నెలలు ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.
5.స్కిల్ కేసులో లోకేష్ పిటిషన్ డిస్పొజ్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు డిస్పొజ్ చేసింది.
6.జగన్ పై అచ్చెన్న విమర్శలు
విశాఖను దోచుకోవాలని జగన్ వస్తున్నారని టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు విమర్శించారు.
7.ఢిల్లీ హైకోర్టులో టిఆర్ఎస్ పిటిషన్
కారును పోలిన ఉన్న గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్ నుంచి తొలగించాలని కోరుతూ టిఆర్ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు.చేసింది.
8.రైలు ప్రమాద బాధితులకు పరిహారం
బీహార్ లోని బుక్సర్ జిల్లాలో నార్త్ ఈస్ట్ సూపర్ ఫాస్ట్ రైలు భోగిలు పట్టాలు తప్పిన ఘటనలో మృతి చెందిన నలుగురు ప్రయాణికులకు 10 లక్షల చొప్పున పరిహారాన్ని రైల్వే శాఖ ప్రకటించింది.
9.కేటీఆర్ హరీష్ రావులతో కేసీఆర్ అత్యవసర భేటీ
ప్రగతిభవన్లో మంత్రులు కేటీఆర్ హరీష్ రావులతో తెలంగాణ సీఎం కెసిఆర్ అత్యవసరంగా భేటీ అయ్యారు.
10.రంగాజాలంపై 18% జీఎస్టీ
పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చే జలంపై 18 శాతం జిఎస్టి విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
11.హైదరాబాద్ ఇన్చార్జి సిపి గా విక్రమ్ సింగ్ మాన్
హైదరాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ గా విక్రమ్ సింగ్ మాన్ నియమితులయ్యారు.
12.దళిత బంధు నిలిపివేత
తెలంగాణ రాష్ట్ర దళితులకు ఇస్తున్న దళిత బంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఈ పథకానికి బ్రేక్ పడింది.
13.ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది .గురువారం పీరాగర్జి మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న బూట్ల ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి.
14.మేరా యువభారత్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
నైపుణ్యాభివృద్ధిలో నాయకత్వ లక్షణాలు చెంపొందించడమే లక్ష్యంగా ‘ మేరా భారత్ పేరిట కొత్త కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
15.సింగరేణి ఎన్నికలు
సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలను డిసెంబర్ 27న నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
16.కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శలు
కాంగ్రెస్ పాలించిన 60 ఏళ్లలో చేసిందేమీ లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
17.దసరా సెలవులు
రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు .మళ్లీ ఈ నెల 26 నుంచి బడులు పునః ప్రారంభమవుతాయని తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది.
18.రేవంత్ రెడ్డి విమర్శలు
తెలంగాణలో నిరుద్యోగుల అంశంపై రేవంత్ రెడ్డి స్పందించారు .నిరుద్యోగులు వారి తల్లిదండ్రుల ఉసురు బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగులుతుందని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
19.ఫైబర్ నెట్ కేసు
విజయవాడ ఏసీబీ కోర్టు సిఐడి అధికారులు దాఖలు చేసిన ఫైబర్ గ్రిడ్ పిటి వారెంట్స్ పై విచారణ రేపటికి వాయిదా పడింది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 54,000
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 58,910
.