తిమ్మాసి కుంటను పరిశీలించిన జిల్లా, మండల అధికారుల బృందం.రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఉన్నటువంటి తిమ్మాసికుంట గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు కుంట కట్ట తెగి పోవడంతో కుంట దిగువ భాగంలో ఉన్నటువంటి వరి పంట పొలాలు కొట్టుకుపోవడం జరిగిందని, ఆ దారి గుండా రోడ్డు కూడా కొట్టుకపోవడం జరిగిందని కుంటకు మరమ్మతులు చేయాలని, ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్( Oggu balaraju yadav ) సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించగా ఈరోజు పంచాయతీరాజ్ డి ఈ సత్యనారాయణ వచ్చి పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిమ్మాసికుంట కట్ట తెగిపోయిన ప్రాంతాన్ని, దిగువన ఉన్న వరి పంట పొలాలను పరిశీలించి ప్రకృతి వైపరీత్యాల నిధులనుండి కల్వర్టును ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదనలు చేసి కలెక్టర్ కు నివేదిక అందిస్తామని తెలిపారు.ఆయన వెంట ఇరిగేషన్ డి ఈ సత్యనారాయణ,తహసిల్దార్ జయంత్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతోష్, గ్రామ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్, మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, రైతులుఉన్నారు.