రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి శనివారం వేములవాడ టౌన్ సి.ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో వేములవాడ పరిధిలోని జయవరం వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 50 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక డంపులు,స్వాధీన చేసుకొని సీజ్ చేయడం జరిగింది.
ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఇసుక రవాణానాకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సంబంధం ఉన్న వ్యక్తుల పై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇసుక అక్రమ రవాణాకు గాని అక్రమ నిల్వ లకు పాల్పడే వారి పై కేసులు నమోదు చేయడం తో పాటుగా వాహనాల ను సీజ్ చేయడం జరుగుతుందన్నారు.
ఇసుక అక్రమ రవాణా,అక్రమ నిల్వ కి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే మెసేజ్ యువర్ ఎస్పీ వాట్సప్ నెంబర్:6303922572 డైరెక్ట్ గా సమాచారం అందించవచ్చని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయని అన్నారు.