శివాలయంలో బాలాలయ నిర్మాణానికి భూమి పూజ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పురాతన శివాలయం లో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి కి బాలాలయ నిర్మాణానికి బుధవారం ఉదయం 7-00 గంటల ముహూర్తమున కరీంనగర్ వేద భవనం గురువు శ్రీ కలకుంట్ల వరప్రసాదా చార్యుల చేతుల మీదుగా భూమి పూజ చేశారు.శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయ పునర్నిర్మాణంలో భాగంగా శాంతి హవనం , వాస్తు హవనం, విశ్వక్షేన విజ్ఞాపన పూజాది కార్యక్రమాలను శ్రీ కలకుంట్ల వరప్రసాద చార్యుల ఆధ్వర్యంలో ఆలయ పూజారి బిట్కూరి నవీన్ చారి, నిర్వహించారు.

 Bhoomi Pooja For Balalayam Construction In Shivalayam, Bhoomi Pooja ,balalayam C-TeluguStop.com

శివాలయంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి బాలాలయ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు.

ఈ భూమి పూజ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, గ్రామ పురోహితులు రాచర్ల దయానంద్ శర్మ , ఆలయ కమిటీ చైర్మన్ నంది కిషన్ , ఉపాధ్యక్షులు ముత్యాల పల్లవి ప్రభాకర్ రెడ్డి , సందుపట్ల లక్ష్మారెడ్డి, ప్రతినిధులు గుండాడి వెంకట్రెడ్డి, మెగి నర్సయ్య, పారిపెల్లి రాంరెడ్డి, ముప్పవరం రాధాక్రిష్న రావు , బండారి బాల్ రెడ్డి , ఎలగందుల నరసింహులు,

మాజీ సర్పంచ్ నేవూరి మమతారెడ్డి , ముప్పవరం ఉదయలక్ష్మి గాజుల విజయ, బొమ్మకంటి విజయ , పబ్బ లావణ్య , శ్యామ మంజుల , కృష్ణభక్తులు ఈశ్వర్ , గ్రామస్తులు సందుపట్ల లక్ష్మారెడ్డి, గన్న పద్మారెడ్డి , శ్రీనివాస్ రెడ్డి, రావుల మల్లారెడ్డి , బంధారపు బాల్ రెడ్డి,దొంతి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం పాల్గొన్న భక్తకోటికి వరప్రసాద చార్యులు దద్దోజనం తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు.బాలాలయ నిర్మాణం పనులను కాంట్రాక్టర్ లక్ష్మారెడ్డి బుధవారం ప్రారంభించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube