రాజన్న సిరిసిల్ల జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు సాహెబ్ ఆధ్వర్యంలో గంభీరావుపేట మైనార్టీ సెల్ అధ్యక్షులుగా మహమ్మద్ యాదుల్లా( Mohammed Yadullah ) ని నియమించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా సాహెబ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి కాంగ్రెస్ పార్టీ( Congress party ) ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న ఎన్నికల్లో ముస్లిం మైనార్టీ వర్గాలకు కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యే విధంగా కృషి చేయాలని తెలపడం జరిగింది.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మహమ్మద్ యాదుల్లా మాట్లాడుతూ తన నియామకం పట్ల కృషిచేసిన కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనన్న, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి( KK Mahender Reddy ), మండల కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ హామీద్, గంభీరావుపేట పట్టణ అధ్యక్షులు పాపా గారి రాజు గౌడ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి రాబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంలో తన భాగస్వామి ఉంటుందని తెలిపారు.