కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ఆచార్య.ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు తన తనయుడు రామ్ చరణ్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇక ఇందులో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే జతకట్టారు.
ఇందులో రామ్ చరణ్ పూజ హెగ్డే సిద్ధూ, నీలాంబరి పాత్రలో కనిపించనున్నారు.
ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్స్ ప్రేక్షకులకు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం నీలాంబరి అనే పాటను విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఈ పాటను విడుదలచేసిన కొంత సమయానికి లక్షలలో వ్యూస్ దక్కించుకుంటూ దూసుకుపోయింది.
ప్రస్తుతం ఈ పాట యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతూ ఏకంగా 9 మిలియన్ వ్యూస్ దక్కించుకొని రికార్డులు సృష్టిస్తోంది.మణి శర్మ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలెట్ కానుంది.అనంత శ్రీరామ్ అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి రమ్య బెహరా ఎంతో అద్భుతంగా పాడారు.
ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది.ఇక రామ్ చరణ్ ఆచార్యతో పాటు RRR చిత్రంలో నటించారు.
ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.