మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ చేస్తున్న సినిమాల్లో ‘ఆచార్య’ సినిమా ఒకటి.ఈ సినిమా మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కుతుంది.
ఇందులో చిరంజీవి తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
చిరంజీవి కెరీర్ లో 152 వ సినిమాగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాపై అభిమానులు పెద్ద అంచనాలనే పెట్టుకున్నారు.
ఇందులో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంటే.
రామ్ చరణ్ కు జతగా పూజా హెగ్డే నటిస్తుంది.ఇప్పటికే ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపు కుంటుంది.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా ప్రచార చిత్రాలు, టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి.అలాగే ఫస్ట్ సింగిల్ ‘లాహె లాహె’సాంగ్ ప్రేక్షకులను బాగా అలరించింది.
ఇక ఇప్పుడు మరొక పాటను విడుదల చేసారు మేకర్స్.ఈ సాంగ్ రామ్ చరణ్, పూజ హెగ్డే మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్.
నిన్న దీపావళి సందర్భంగా నీలాంబరి సాంగ్ ప్రోమో వదిలారు.ఇక ఈ రోజు ఈ పాట ఫుల్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.”నీలాంబరి నీలాంబరి.వేరెవ్వరే నీలా మరి” అంటూ సాగే ఈ పాట మంచి ఫీల్ తో ఆకట్టుకుంటుంది.
చరణ్, పూజా పెయిర్ కూడా చూడడానికి చాలా బాగుంది.ఇక ఈ పాటలో రామ్ చరణ్ వేసిన డాన్స్ స్టెప్పులు కూడా ఆకట్టు కుంటున్నాయి.ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిగా మణిశర్మ సంగీతం ఆకట్టుకుంటుంది.ఇక ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాను 2022 ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.