బాలకృష్ణ మొట్టమొదటి సారిగా హాట్ గా చేస్తున్న షాట్ ‘అన్ స్టాపబుల్ విత్ NBK’.ఈ షో ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ అయ్యింది.ఈ రోజు దీపావళి సందర్భంగా మొదటి ఎపిసోడ్ ఆహా లో ఉదయం 11.20 నిముషాల నుండి స్ట్రీమింగ్ అవ్వడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఈ షో ను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.ఈ ఫస్ట్ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూసారు.
ఎట్టకేలకు ఈ రోజు మొదటి ఎపిసోడ్ రిలీజ్ అవ్వడంతో అభిమానులు ఈ షోను చూస్తూ దీపావళి రోజు ఎంజాయ్ చేస్తున్నారు.
ఈ షోలో మొట్టమొదటి ఎపిసోడ్ లో నందమూరి బాలకృష్ణ పైసా వసూల్ సాంగ్ తో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు.డాన్స్ తో పాటు డైలాగ్స్ తో కూడా బాలయ్య అదర గొట్టాడు.
ఇక ఈ షో లో మోహన్ బాబు మొదటి గెస్ట్ గా వచ్చారు.ఆయనతో పాటు మంచు విష్ణు, మంచు లక్ష్మి కూడా ఈ షోకు రావడంతో పాటు వీరి మధ్య ఆసక్తికర సంభాషణ కూడా జరిగింది.
బాలయ్య అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తూనే మధ్యమధ్యలో మోహన్ బాబు కూడా బాలయ్యను ప్రశ్నించారు.ఈ ఎపిసోడ్ ఆద్యంతం నవ్వులతో ఆసక్తికరంగా సాగింది.ఈ క్రమంలోనే బాలకృష్ణ మోహన్ బాబును ఒక ప్రశ్న అడగగా దానికి మోహన్ బాబు ఆడిపోయే సమాధానం చెప్పారు.చిరంజీవిపై మీకున్న అభిప్రాయం ఏమిటి ? అని మోహన్ బాబును బాలకృష్ణ ప్రశ్నించారు.
దీనికి మోహన్ బాబు అలోచించి సమాధానం చెప్పారు.చిరంజీవి మంచి నటుడుఅద్భుతంగా డాన్స్ చేస్తాడు.వ్యక్తిగతంగా చిరంజీవిపై నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు.ఆయన అల్లు రామలింగయ్య కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు.అల్లు గారితో నేను ఎన్నో సినిమాలు చేశాను.సురేఖ నాకు సోదరి లాంటిది అంటే మన ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అతడు బాగున్నాడు అని ఆసక్తిగా సమాధానం చెప్పాడు.