టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోగా నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే నటుడు మోహన్ బాబు తన కూతురు తనయులయిన మంచు లక్ష్మి, మంచు విష్ణు, మంచు మోహన్ మనోజ్ తదితరులను తన వారసులుగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
దీంతో మంచు లక్ష్మి ప్రస్తుతం పలురకాల షోలు, ఈవెంట్లలో హోస్ట్ గా నిర్వహిస్తూ బాగానే అలరిస్తోంది.
అంతేకాకుండా అప్పుడప్పుడు పలు చిత్రాలలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తూ బాగానే ఆకట్టుకుంటోంది.
ఇక మంచు విష్ణు విషయానికి వస్తే ప్రస్తుతం వరుస సినిమాలలో హీరోగా నటిస్తూ బాగానే అలరిస్తున్నాడు.కాగా ఆ మధ్య తెలుగులో మోసగాళ్ళు అనే చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించాడు.
కానీ మోసగాళ్ళు చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
అయితే తాజాగా మంచు ఫ్యామిలీకి సంబంధించి నటువంటి ఓ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
అయితే ఇందులో మంచు లక్ష్మి చిన్నప్పుడు తన ఇద్దరి తమ్ముళ్ళతో కలసి ఆడుకుంటుండగా ఈ ఫోటోలు తీసినట్లు తెలుస్తోంది.దీంతో కొందరు మంచు ఫ్యామిలీ అభిమానులు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మంచు మోహన్ బాబు తెలుగులో సన్ ఆఫ్ ఇండియా అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మిస్తున్నట్లు సమాచారం.ఇక మంచు మనోజ్ విషయానికి వస్తే ప్రస్తుతం అహం బ్రహ్మాస్మి అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు దాదాపుగా 50 శాతం పూర్తయినట్లు సమాచారం.
ఇక మంచు లక్ష్మి కూడా ప్రముఖ ఓటిటి అయిన ఆహ లో ప్రసారమయ్యే “ఆహా బోజనంబు” అనే షోలో హోస్ట్ గా పని చేస్తోంది.