తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి.ముఖ్యంగా టీఆర్ఎస్కు మొదటి నుంచి సపోర్టుగా ఉంటున్న రెడ్డి సామాజిక వర్గం చేజారి పోతుందని కేసీఆర్ గ్రహించినట్టున్నారు.
వారిని మళ్లీ దగ్గర చేసుకునేందుకు ఆ వర్గానికే ఎక్కువ ఎమ్మెల్సీ పదవులు ఆఫర్ చేశారు.ఆరు ఎమ్మెల్సీ పదవులు ఉంటే ఇందులో మూడు సీట్లు ఆ వర్గానికే కేటాయించారు.
ఎమ్మెల్యే కోటాలో ఈజీగా వారికే పదవులు సొంతం అయిపోతాయి.మరి ఈ వర్గాన్ని కేసీఆర్ ఎందుకు ఇంతలా దగ్గర తీసుకుంటున్నారన్నది ఇప్పుడు బలంగా వినిపిస్తున్న ప్రశ్న.
టీఆర్ ఎస్లో ఎంతోమంది పార్టీ పెట్టిన మొదటి నుంచి కష్టపడ్డ వారు ఉన్నా కూడా బయటి వారికే ప్రాధాన్యత దక్కిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.అయితే ఇందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
రెడ్డి సామాజిక వర్గం గతకొద్ది రోజులుగా టీఆర్ ఎస్ మీద గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.మరీ ముఖ్యంగా రేవంత్రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత ఆ వర్గం మొత్తం రేవంత్ వైపు మళ్లిపోతోంది.
ఆయనకే ఆ సంఘాలు బలంగా మద్దతు ఇస్తున్నాయి.దీంతో కేసీఆర్ అలర్ట్ అయిపోయారు.
ఎలాగైనా వారిని తనవైపు తిప్పుకునేందుకు ప్లాన్ వేశారు.
తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం బలంగా ఉంది.
ఆర్థికంగా, సామాజికంగా ముందుండడంతో ఆ వర్గాన్ని ఓన్ చేసుకుంటే పార్టీకి వారు పట్టు కొమ్మల్లా ఉంటారనేది కేసీఆర్ వాదన.అందుకే ఆ వర్గాన్ని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.పైగా ఉత్తర తెలంగాణలో రెడ్డి వర్గాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంటే తనకు తిరుగుండదని కేసీఆర్ భావిస్తున్నారంట.కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్న రెడ్లను గులాబీ గూటికి రప్పించేందుకు కేసీఆర్ ఈ ప్లాన్ వేశారంట.
రెడ్డిలు రాష్ట్రంలో పాలిటిక్సలో అలాగే వ్యాపారాల్లో చాలా పెద్ద స్థాయిల్లో ఉన్నారు.ఆ వర్గం అండదండలు కచ్చితంగా ఉండాలనే లక్ష్యంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.