సీనీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు.సినిమాల్లో అవకాశాలు తగ్గుముఖం పట్టగానే రాజకీయాలవైపు చూడడం సర్వ సాధారణం అయిపొయింది.
ఇప్పటికే ఎంతోమంది సినీ నటులు రాజకీయాల్లో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు.ఇక ఇప్పుడు అసలే ఎన్నికల సమయం కావడంతో వెండితెర మీద నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని చూస్తున్నవారంతా … ఇదే సరైన సమయమని భావిస్తున్నారు.
అందుకే పొలిటికల్ తెర మీద తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇప్పుడు సిద్ధం అవుతున్నారు.ఈ విధంగానే బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఒకరు రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధం అయిపోయారు.
ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది.దీనిలో భాగంగానే… రాబోయే లోక్సభ ఎన్నికల్లో భోపాల్ టికెట్ను నటి కరీనా కపూర్కు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.భోపాల్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని.
దానిలో భాగంగా ఇక్కడ నుంచి కరీనాను పోటీ చేయిస్తే బాగుంటుందని కాంగ్రెస్ నాయకులు గుడ్డు చౌహాన్, అనీస్ ఖాన్ లు ఆ పార్టీ అధిష్ఠానానికి సూచించినట్లు తెలుస్తోంది.ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే కాక మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కోడలు వంటి అంశాలు కరీనా గెలిచేందుకు సహకరిస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.
అసలు ఆమెనే ఎందుకు రంగంలోకి దించాలని చూస్తుంది అంటే… సైఫ్ అలీ ఖాన్ తాత ఒకప్పుడు భోపాల్ నవాబ్గా ఉన్నారు.దీంతో ఈ లోక్సభ ఎన్నికల్లో కరీనా.
కాంగ్రెస్ తరఫున భోపాల్ నుంచి పోటీ చేస్తే తప్పక గెలుస్తుందని చౌహాన్ అధిష్టానానికి తెలిపినట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వెలువడక ముందే బీజేపీ నాయకులు విమర్శించడం ప్రారంభించారు.
బీజేపీని ఎదుర్కోగల బలమైన అభ్యర్థి కాంగ్రెస్లో ఎవరూ లేరు.
అందుకే సినితారలను నిలబెట్టాలని భావిస్తోంది అంటూ సెటైర్లు కూడా వేస్తున్నాడు.కాంగ్రెస్ కు స్థానిక నాయకులు ఎవరూ కనిపించడం లేదంటూ బీజేపీ విమర్శలు ప్రారంభించింది.అయితే కాంగ్రెస్ మాత్రం కరీనా రాకతో తమ పార్టీకి మరింత క్రేజ్ వస్తుంది అనే ఆలోచనలో ఉంది.
అయితే ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ ఇంకా స్పష్టమైన ప్రకటన అయితే చేయలేదు.