తెలంగాణ మంత్రి కేటీఆర్ తో కామారెడ్డి రైతులు సమావేశం అయ్యారు.ఇందులో భాగంగా మాస్టర్ ప్లాన్ అంశంపై చర్చించారు.
అయితే మాస్టర్ ప్లాన్ ను గతంలోనే రద్దు చేసినట్లు మున్సిపల్ శాఖ చెప్పిన విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.ఈ క్రమంలో మరోసారి డీటీసీపీ అధికారులతో మాట్లాడిన కేటీఆర్ మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
అదేవిధంగా పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా అండగా ఉంటామని భరోసా ఇచ్చిన మంత్రి కేటీఆర్ రైతులపై కేసులను ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.