ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో( CS Jawahar Reddy ) రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా( DGP Harish Kumar Gupta ) సమావేశం అయ్యారు.ఈ మేరకు సెక్రటేరియట్ లో వీరి భేటీ జరుగుతోంది.
ఎన్నికల సంఘం( Election Commission ) నుంచి ఆదేశాలు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు అధికారులు చర్చిస్తున్నారని తెలుస్తోంది.
అయితే ఎన్నికల పోలింగ్ రోజుతో పాటు తరువాత రోజు చోటు చేసుకున్న అల్లర్లపై ప్రాథమిక నివేదికను రూపొందించిన సిట్ ( SIT ) దాన్ని ఈసీకి అందజేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఎలక్షన్ కమీషన్ ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుందనే దానిపై సీఎస్, డీజీపీ చర్చిస్తున్నారని సమాచారం.







