ఆగష్టు 18 వరకు ఖమ్మం రూరల్ మండలంలో 144 సెక్షన్ యధావిధిగా అమలులో వుంటుందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ తెలిపారు ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి లో తమ్మినేని కృష్ణయ్య హత్య ఘటన నేపథ్యంలో ఆగష్టు 18 సాయంత్రం 6:00 గంటల వరకు 144 సెక్షన్ ఆంక్షలు అమలుల్లో వుంటుందని తెలిపారు.ఎలాంటి సభలు, ర్యాలీలకు, సమావేశాలు నిర్వహించరాదని, గుంపులుగా తిరగడం నిషేధమని తెలిపారు.నిషేధం వున్న నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు.
తాజా వార్తలు