ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు తమ వ్యక్తిగత విషయంలో ఎదురైన అనుభవాలను తమ అభిమానులతో బాగా పంచుకుంటారు.అంతేకాకుండా తమ జీవితంలో ఎదుర్కొన్న చేదు జ్ఞాపకాలను కూడా అన్ని పంచుకుంటుంటారు.
సలహాలు ఇస్తుంటారు.ఇదిలా ఉంటే తాజాగా ఓ నటి కూడా కొన్ని విషయాలను పంచుకుంది.
అందులో తాను ఇచ్చిన సలహా కూడా వైరల్ గా మారింది.
ఇంతకీ ఆమె ఎవరో కాదు బాలీవుడ్ సీనియర్ నటి, టెలివిజన్ నటి నీనా గుప్తా.ఈమె నటిగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగా కూడా పనిచేసింది.ఇక తన నటనకు ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది.
బుల్లితెరపై పలు షో లలో చేసింది.ఇక ఈమె గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.
పైగా తాను ఎదుర్కొన్న విషయాల గురించి కూడా అప్పుడప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.
ఇక తాజాగా తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఓ విషయాన్ని పంచుకుంది.
తన ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసుకుంది.అందులో తాను ఓ పుస్తకంలో చదివిన వాక్యాన్ని పంచుకుంది.
పెళ్లయిన మగాడితో ప్రేమలో పడితే కళ్ళకు మస్కారా పెట్టుకోవద్దు అంటూ.ఈ లైన్ చాలా బాగుంది కదా.నేనేం చెప్తున్నానో మీకు ఈపాటికే అర్థమైంది కదూ అని ప్రశ్నించింది.
దీంతో నెటిజన్లు అవును అని స్పందిస్తూ.పెళ్లయిన మగాళ్లను ప్రేమిస్తే మిగిలేది కన్నీళ్లేనంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక కొందరు ఆమె ఇచ్చిన సలహా బాగుంది అని పొగుడుతున్నారు.
ప్రస్తుతం ఈమె షేర్ చేసిన వీడియో నెట్టింట్లో బాగా వైరల్ గా మారింది.ఈమె కూడా గతంలో పెళ్లయిన వ్యక్తిని ప్రేమించింది.
అతడు కాదని చెప్పేసరికి అతడితో జన్మనిచ్చిన ఓ బిడ్డ తో ఒంటరిగా మిగిలిపోయింది.