సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పై బీజేపీ నేత సీరియస్ కామెంట్స్..!!

తెలుగు రాజకీయాలు విశాఖ ఉక్కు పరిశ్రమ( Vishaka Steel ) చుట్టు తిరుగుతున్నాయి.ఈ విషయంలో తెలంగాణ అధికార పార్టీ BRS పార్టీ కీలక నేతలు చేసిన వ్యాఖ్యలు మరింత రాజకీయ వేడిని రాజేసాయి.

 Bjp Leader Vishnuvardhan Reddy Serious Comments On Former Cbi Jd Lakshminarayana-TeluguStop.com

తమ వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని హరీష్ రావు వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.పరిస్థితి ఇలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం మనందరి బాధ్యత అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ( JD Lakshmi Narayana ) ప్రైవేట్ కంపెనీ ద్వారా బిడ్ దాఖలు చేయడం తెలిసిందే.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ తెలుగు వాళ్ళందరికీ బిడ్డ లాంటిదని.జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.ఈ క్రమంలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి( Vishnuvardhan Reddy ) స్పందించారు.కేసీఆర్ అజెండాను ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయడానికి కొందరు నాయకులు సిద్ధమయ్యారని ఆరోపించారు.

సీమ నీళ్లను ఆంధ్ర ఆస్తులను దోచుకుంటున్న కేసీఆర్ ను భుజాన మోయటం సిగ్గుచేటని విమర్శించారు.కేసీఆర్ ట్రాప్ లో జేడీ లక్ష్మీనారాయణ పడ్డారని… విశాఖ ఉక్కు గురించి జయప్రకాష్ నారాయణను అడిగి తెలుసుకోవాలి అని హితవు పలికారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube