సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఇందులో భాగంగా బీజేపీ, కాంగ్రెస్ (BJP ,Congress)లపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
బీజేపీ కార్మిక మరియు కర్షక వ్యతిరేక పార్టీ అని హరీశ్ రావు (Harish Rao)ఆరోపించారు.అయోధ్య రామాలయం బీజేపీ కట్టిందా అని ప్రశ్నించిన ఆయన ట్రస్ట్ కట్టిందని తెలిపారు.అయోధ్య రామాయల(Ayodhya Ramayala) నిర్మాణానికి తాను కూడా రూ.2 లక్షలు ఇచ్చానన్నారు.అనంతరం కాంగ్రెస్ పై మండిపడిన ఆయన హైదరాబాద్ లో రాహుల్ గాంధీ(ahul Gandhi, Hyderabad) సభ తుస్సుమందని విమర్శించారు.రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారన్న ఆయన కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.