తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కామన్ మాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
సీరియల్ నటుడు అమర్ దీప్-పల్లవి ప్రశాంత్ టైటిల్ కోసం పోటీపడ్డారు.ప్రేక్షకుల ఓట్లతో పల్లవి ప్రశాంత్ టైటిల్ కైవశం చేసుకున్నాడు.అయితే విన్నర్ గా పల్లవి ప్రశాంత్ రూ.35 లక్షల ప్రైజ్ మనీ, ఒక కారు, డైమండ్ నెక్లెస్ బహుమతులుగా అందుకున్నాడు.ప్రేక్షకుల మనసులు గెలిచేందుకు పల్లవి ప్రశాంత్ చాలా కష్టపడ్డాడు.టాస్క్స్, గేమ్స్ లో సత్తా చాటాడు.అలాగే రైతు బిడ్డ ట్యాగ్ కూడా అతనికి బాగా ఉపయోగపడింది.
అయితే తాను టైటిల్ విన్నర్( Title winner ) అయితే ఆ డబ్బులు పేద రైతులకు పంచిపెడతాని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.బిగ్ బాస్ షో( Bigg Boss Show ) వేదికగా ఈ మాట పలుమార్లు చెప్పాడు.మరి చెప్పినట్లే పల్లవి ప్రశాంత్ తానూ గెలుచుకున్న డబ్బులు పేద రైతులకు పంచాడా? లేదా ? అనే సందేహాలు మొదలయ్యాయి.అయితే షో ముగిసి రెండు నెలలు అవుతుంది.అయినా పల్లవి ప్రశాంత్ పేద రైతులకు డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు.తాను సహాయం చేసిన వీడియోలు షేర్ చేస్తానని పంచిన ప్రతి రూపాయికి లెక్క చెబుతానని పల్లవి ప్రశాంత్ చెప్పాడు.అయితే ఆ సూచనలేమీ కనిపించడం లేదు.
బయటకు వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు పల్లవి ప్రశాంత్.ప్రస్తుతం వేడుకల్లో ఫుల్ బిజీగా ఉంటున్నాడు.
సెలబ్రిటీ హోదా( Celebrity status ) ఎంజాయ్ చేస్తున్నాడు.షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.తన స్పై బ్యాచ్ శివాజీ, ప్రిన్స్ యావర్ లతో పార్టీలు ఎంజాయ్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.హౌస్ లో ఉన్నప్పుడు డబ్బులు రైతుల కోసం ఖర్చు చేస్తానని మాట ఇచ్చావు.
మరి ఎప్పుడు మాటను నిలబెట్టుకుంటావు అంటూ నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.ఇంకొందరు అది హౌస్ లో ఉన్నంతవరకు గెలవడం వరకు మాత్రమే అలా మాట్లాడాడు.
గెలిచిన తర్వాత ఒకసారిగా ఫ్లేట్ ఫిరాయించాడు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.