సూపర్ స్టార్ మహేష్ బాబు లైనప్ మిగితా హీరోలకి చెమటలు పట్టించేలా కొనసాగుతోంది.బ్రహ్మోత్సవం లాంటి క్లాస్ సినిమా తరువాత మురుగదాస్ తో భారి ద్విభాష చిత్రాన్ని ప్లాన్ చేసిన మహేష్, ఆ తరువాత కూడా కేవలం తెలుగు వరకే పరిమతం అయ్యే అలోచనలో లేడు.
రాజా రాణీతో తెలుగు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్న దర్శకుడు అట్లీ.మరోవారం రోజుల్లో ఈ దర్శకుడి రెండొవ చిత్రం తెరి (తెలుగులో పోలీసోడు) విడుదల కానుంది.
విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రం మీద మార్కేట్ లో మంచి అంచనాలు ఉన్నాయి.సినిమా మీద ఉన్న నమ్మకంతో, దిల్ రాజు తెలుగులో భారి విడుదలకి ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రం కూడా హిట్ అయితే అట్లీ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది.
సూపర్ స్టార్ అభిమానులకి ఇక్కడ చెప్పే గుడ్ న్యూస్ ఏంటంటే, మహేష్ బాబు – అట్లీ కాంబినేషన్లో ఒక ద్విభాష చిత్రం కోసం చర్చలు జరుగుతున్నాయి.
తెరి హిట్ టాక్ సొంతం చేసుకోని, కథ చర్చలు సఫలం అయితే, మురుగదాస్ తరువాత ఈ సినిమా మొదలైనా ఆశ్చర్యపోనక్కరలేదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.