ఏపీలో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతిపక్షం టీడీపీ ప్రణాళికలు రచిస్తోంది.ఈ క్రమంలోనే పార్టీలో సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టింది.
టీడీపీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా ప్రణాళికలు రచిస్తోంది.ఇందులో భాగంగానే ప్రతి 30 కుటుంబాలకు ఒక సాధికార సారథిని నియమించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు.
ప్రతి నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథి విభాగం ఉంటుందన్నారు.ఈ నియామకాల్లో మహిళలకు కూడా ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
పార్టీలో ఉన్న సెక్షన్ ఇంఛార్జ్ లు అందరినీ కుటుంబ సాధికార సారథులుగా పిలుస్తామని వెల్లడించారు.కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేశారు.