రాజేంద్రుడి షాకింగ్‌ నిర్ణయం

కమెడియన్‌గా, హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎంతో కాలంగా తెలుగు సినిమా పరిశ్రమలో కొనసాగుతూ వస్తోన్న రాజేంద్ర ప్రసాద్‌ మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చాడు.తెలుగు సినిమా పరిశ్రమలో నటీనటులు ఎదుర్కొంటున్న సమస్యలను తాను పరిస్కరిస్తాను అంటూ నటకిరీటి ముందుకు వచ్చాడు.

 Rajendra Prasad To Contest In Maa Elections-TeluguStop.com

త్వరలో జరుగబోతున్న మా ఎన్నికల్లో తాను పాల్గొంటానని స్వయంగా ప్రకటించాడు.మా అభివృద్ది కోసం పని చేసేందుకు తాను ముందుకు వస్తున్నట్లుగా ఈ సందర్బంగా రాజేంద్రుడు చెప్పుకొచ్చాడు.

గత రెండు సంవత్సరాలుగా మా అధ్యక్షుడిగా మురళి మోహన్‌ ఉన్న విషయం తెల్సిందే.ఇటీవలే ఈయన ఎంపీగా ఎన్నికయ్యాడు.

దాంతో మా అధ్యక్ష పదవికి మరోసారి ఈయన పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.అందుకే ఈసారి తాను బాధ్యతలు చేపడుతాను అంటూ ముందుకు వచ్చాడు రాజేంద్ర ప్రసాద్‌.

గత రెండు సార్లు కూడా మురళి మోహన్‌ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యాడు.ఈసారి రాజేంద్ర ప్రసాద్‌ కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఏకగ్రీవం కాని పక్షంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సిద్దంగా ఉన్నాను అంటూ ఈయన ప్రకటించాడు.మార్చి చివర్లో ఈ ఎన్నికలు ఉండే అవకాశాలున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube