టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో చైతన్య సమంతల జోడీ కూడా ఒకటి కాగా సమంత, చైతన్యలు అధికారికంగా విడిపోతున్నట్టు ప్రకటన చేయడంతో చైతన్య సమంతకు ఇచ్చే భరణం ఎంతనే చర్చ జరుగుతోంది.సోషల్ మీడియాలో చైతన్య సమంతకు ఇచ్చే భరణం గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతుండగా కొంతమంది చైతన్య 300 కోట్ల రూపాయలు భరణంగా ఇస్తున్నారని చెబితే మరి కొందరు 50 కోట్ల రూపాయలు భరణంగా ఇస్తున్నారని చెబుతున్నారు.
మరోవైపు చైతన్యకు చెందిన సన్నిహిత వ్యక్తి సమంత, చైతన్య విడిపోయినా ఒకరిపై మరొకరు కోర్టులో కేసులు వేయకూడదని భరణం అడగకూడదని అగ్రిమెంట్ చేయించారని పెళ్లికి ముందే ఈ అగ్రిమెంట్ చేయించారని వార్తలు వస్తున్నాయి.అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం సమంత అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎలాంటి భరణం తీసుకోవడం లేదు.
చైతన్య కుటుంబం సమంతకు భరణంగా 200 కోట్ల రూపాయల ఆఫర్ చేశారని సమాచారం.
అయితే సమంత మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదని భావించినట్టు తెలుస్తోంది.
విడిపోవడానికి కారణాలు ఏవైనా చైతన్య కుటుంబం నుంచి ఏమీ ఆశించకూడదని సమంత భావిస్తున్నట్టు సమాచారం.ఫ్యామిలీ మ్యాన్2 వెబ్ సిరీస్ సమంతకు మంచి పేరు తెచ్చిపెట్టింది.అయితే ఆ వెబ్ సిరీస్ వల్లే చైసామ్ మధ్య గొడవలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది.సమంత నటించిన శాకుంతలం సినిమా 2022లో రిలీజ్ కానుంది.
దుష్యంతుడు, శకుంతల ప్రేమకథను గుణశేఖర్ అందంగా చూపించబోతున్నారని సమాచారం.మలయాళ నటుడు దేవ్ మోహన్ సమంత పక్కన నటించారు.సమంతకు ఉండే క్రేజ్ వల్లే ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందో లేదో చూడాల్సి ఉంది.
సమంత కెరీర్ కు ఈ సినిమా ప్లస్ అవుతుందని సామ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.