మరికొన్ని రోజుల్లో 2010 – 2019 దశాబ్దం పూర్తి కాబోతుంది.ఎప్పటిలాగే ఈ దశాబ్దంలో ఎన్నో అద్బుతాలు జరిగాయి.
మరెందరో గొప్ప వారు ఆవిష్కరించబడ్డారు.ఇక సినిమా పరిశ్రమలో కూడా చాలా మార్పులు వచ్చాయి.
ముఖ్యంగా ఈ దశాబ్దంలో మన సౌత్ ఇండియా స్థాయి ఏంటో ఉత్తరాది వారికి తెలిసి వచ్చింది.చాలా గొప్ప సినిమాలు చేసి మన సౌత్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ బాలీవుడ్ వారికే చుక్కలు చూపించేలా చేశారు.
బాలీవుడ్ రికార్డులను కూడా తూడ్చి పాడేసిన బాహుబలి ఈ దశాబ్దంలోనే వచ్చింది.
ఇక ఈ దశాబ్దపు భారతదేశపు పెద్ద స్టార్ ఎవరు అంటే ఠక్కున వినిపిస్తున్న పేరు ప్రభాస్.బాలీవుడ్లో ఎంతో మంది స్టార్స్ ఉన్నా కూడా మన ప్రభాస్ మాత్రమే ఈ దశాబ్దపు స్టార్ అంటూ ఆయన అభిమానులు చాలా బలంగా గట్టిగా చెబుతున్నారు.ఎందుకంటే వారు ఈ దశాబ్దంలో ప్రభాస్ను మించిన తోపులు ఎవరు లేరు.
ఆయన చేసిన సినిమాలు ఎవరు చేయలేదు అంటూ బలంగా చెబుతున్నారు.ప్రభాస్ బాహుబలి మరియు సాహో చిత్రాల బడ్జెట్ల విషయంలో కూడా తోపు అని నిరూపించుకున్నాడు.
ప్రభాస్ మినహా మరెవ్వరు కూడా ఈ దశాబ్దపు గొప్ప హీరోగా నిలిచే అర్హత కలిగి లేరు అంటున్నారు.ఇండియా వ్యాప్తంగా ఆకట్టుకున్న బాహుబలి మరియు సాహో చిత్రాలను చేసినందుకు ఆయన్ను దశాబ్దపు హీరో అంటున్నారు.బాలీవుడ్లో అక్షయ్ కుమార్ ఇంకా అమీర్ ఖాన్లు సూపర్ హిట్స్ దక్కించుకున్నా వారు మాత్రం ఇండియా వ్యాప్తంగా ఆకట్టుకోలేదు.అందుకే ప్రభాస్నే ఈ దశాబ్దపు స్టార్ అంటూ డిక్లైర్ చేయడం జరిగింది.