చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నాడు

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ విపత్తు సమయంలో దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నాడు అంటూ వైకాపా నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కరోనా పాజిటివ్‌ల సంఖ్య విషయంలో అనుమానాలు ఉన్నాయని, ఈ సమయంలో ఉద్యోగులకు ఎందుకు జీతాలు కట్‌ చేస్తున్నారు అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెల్సిందే.

 Ycp Leader Rama Krishna Reddy Comments On Chandrababu Naidu, Ap, Chandrababu Nai-TeluguStop.com

చంద్రబాబు విమర్శలపై నేడు వైకాపా నాయకులు మీడియా సమావేశంలో మండి పడ్డారు.

వైకాపా నాయకుడు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ సమయంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ రాజకీయంను ఏమనాలో అర్థం కావడం లేదు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధోగతి పాలు పట్టించి వెళ్లి పోయిన చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు అంటూ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఈ సందర్బంగా ఆయన అన్నాడు.ఆయన కొడుకు ఇంకా తెలుగు దేశం పార్టీ నాయకులు కొందరు ఈ సమయంలో తీవ్రంగా విమర్శలు చేయడం దారుణంగా ఉందని అన్నారు.

తెలుగు దేశం పార్టీ నాయకులు మంచి చేస్తే చేయండి లేదంటే సోషల్‌ డిస్టెన్స్‌ పాటించి ఇంట్లోనే ఉండండి అంటూ సజ్జల సూచించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube