తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు హీరోలు ఎందరో ఉన్నా హీరోయిన్లు మాత్రం మచ్చుకైనా కనిపించరు.ఒకవేళ కనిపించినా ఒకరో ఇద్దరో.
సిల్వర్ స్ర్కీన్ పై ఎక్స్పోజింగ్ చేయడానికి తెలుగు అమ్మాయిలు పెద్దగా ఆసక్తి చూపరు.కారణం వారు వచ్చిన కుటుంబ నేపథ్యమే.
దీంతో వారికి ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోతాయి.ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా అందాలు ఆరబోసేవారికే మంచి అవకాశాలు వస్తుంటాయి.
కానీ, జనరేషన్ మారుతున్న కొద్ది ప్రేక్షకులు, దర్శక నిర్మాతల్లో మార్పు కనిపిస్తోంది.ప్రధానంగా నటనకు ఇంపార్టెంట్ ఇస్తున్నారు.
అందం, అభినయంతో పాటు కథ డిమాండ్ చేస్తే హీరోయిన్లను డీ గ్లామరెస్ రోల్లో సైతం చూపించడానికి వెనుకాడటం లేదు.
ట్రెండ్ మారుతున్న క్రమంలో తెలుగు అమ్మాయిలు కూడా చిత్ర పరిశ్రమ వైపు చూస్తున్నారు.
తన నటనా ప్రావీణ్యంతో హీరోయిన్లుగా ఎదిగేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఎన్నో కష్టాలు, ఇబ్బందులను దాటుకుని మరో తెలుగు అమ్మాయి వెండితెరపై తొలిసారి లీడ్ క్యారెక్టర్ చేస్తోంది.
ఆమె మరెవరో కాదు ‘శాన్వి మేఘన’.
వాస్తవానికి శాన్వి పదేళ్ల నుంచే ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరిక్షించుకుంటోంది.గతంలో బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్, సైరా నరసింహారెడ్డి, పిట్ట కథలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాల్లో నటించిన ఆశించినంత పేరు రాలేదు.చెప్పుకోతగ్గ అవకాశాలు, కీ రోల్స్ రాలేదు.
తాజాగా విడుదలవుతున్న ‘పుష్పక విమానం’ సినిమాతో ఒక్కసారిగా హీరోయిన్గా మారింది శాన్వి మేఘన.
ఓ టీవీ కార్యక్రమం కోసం జయసుధ ‘శాన్వి మేఘన’కు తొలిసారి అవకాశం ఇవ్వగా, ఇక ఆమె కెరీర్ను మలుపు తిప్పింది మాత్రం దర్శకుడు తరుణ్ భాస్కర్ అని చెప్పొచ్చు.నెట్ఫ్లిక్స్ కోసం ‘పిట్ట కథలు’ అనే వెబ్ సిరీస్ ప్లాన్ చేయగా.దాని ఆడిషన్కు శాన్వి వచ్చింది.
ఆ తర్వాత ‘పుష్పక విమానం’ మూవీ కోసం ‘శాన్వి’ని తరుణ్ భాస్కరే దగ్గరుండి మరీ అవకాశం ఇప్పించారని టాక్.