అమెరికాలో చట్టపరంగా ఉంటున్న హెచ్ -1 బీ బీసాదారులకి ప్రయోజనం చేకూరేలా ఇమ్మిగ్రేషన్ చట్టంలో మార్పులు తీసుకురావాలని భారత ఎన్నారైలు ఆదివారం వైట్ హౌస్ ముందు ధర్నా నిర్వహించారు.
రిపబ్లిక్ హిందూ కొలిషన్(ఆర్హెచ్సీ) ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.
ఈ ధర్నాలో దాదాపు 300 మంది భారతీయులు పాల్గొని తమ నిరసనని ఫ్లకార్డుల రూపంలో ప్రదర్శించారు.
తమ వల్ల అమెరికన్స్ ఉద్యోగాలకి ముప్పు ఉందని అనడం తగదని అన్నారు.అంతేకాదు టెకీలు ముఖ్యంగా మూడు అంశాలని ప్రధానంగా లేవనెత్తారు.
గ్రీన్ కార్డు పొందడానికి విదేశీయులకు శతాబ్దాలు పడుతోంది అలాకాకుండా హెచ్ 1-బీ వీసాదారులు వీసా కోసం దరఖాస్తు పెట్టుకున్న ఒకటి నుంచి ఐదేళ్లలోగా వీసా వచ్చేలా సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా గ్రీన్కార్డుల జారీలో విధిస్తున్న కంట్రీ క్యాప్లో చట్టపరమైన సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.