తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడు కోటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలకు సంగీత దర్శకత్వ బాధ్యతలు నిర్వహించి సూపర్ హిట్ చిత్రాలను అందుకున్నారు.ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కోటి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా కోటి మాట్లాడుతూ తాను మెగాస్టార్ చిరంజీవితో దాదాపు 12 సినిమాల్లో కలిసి చేశానని సంగీత దర్శకుడు కోటి అన్నారు.ఆ తర్వాత వారిద్దరికీ మధ్య జరిగిన ఓ సంఘటన కారణంగా పెద్ద బ్రేక్ వచ్చిందని ఆయన ఇలా చెప్పుకొచ్చారు.
ఓ సారి ఓ సినిమా 100 డేస్ పంక్షన్ ఒంగోలులో జరుగుతున్నపుడు, తాను ఒకరోజు ముందే ఒంగోలుకు దగ్గర్లోని కోట ఊరిలో తన అత్తగారి ఇంటి దగ్గర వచ్చి ఉన్నానని మ్యూజిక్ డైరెక్టర్ అన్నారు.అక్కడికి వెళ్లిన నుంచి తనకు జలుబు, జ్వరం వచ్చి చాలా ఇరిటేషన్గా ఉన్నానన్న ఆయన, అసలు తాను ఆ పంక్షన్కు కూడా వెళ్లలేని పరిస్థితి.
అప్పట్లో ఫోన్స్ కూడా సరిగా ఉండేవి కాదు.కాబట్టి అక్కడున్న ఓ ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి మేనేజర్కు ఫోన్ చేసి, తన పరిస్థితి వివరించి, తాను అక్కడికి రాలేనని ఆయన చెప్పినట్టు కోటి తెలిపారు.
ఆ తర్వాత ఏం జరిగిందో, అసలు ఏమని చెప్పారో తెలియదు.
గానీ అందరికీ మాత్రం వేరేలా వ్యాపించిందని ఆయన చెప్పారు.చిరంజీవి గారికి కూడా ఏం చెప్పారో తనకు తెలియదని, తాను కావాలనే వెళ్లలేదన్నట్టు ప్రచారం చేయడం తనకు నిజంగా చాలా బాధ కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నిజానికి 100 డేస్ ఫంక్షన్, అదీ చిరంజీవి గారితో కావడం ఎవరికైనా వెళ్లాలనే ఉంటుంది గానీ, అలా తనకు మాత్రం ఎందుకు అనిపిస్తుందని ఆయన అన్నారు.
అలా అయ్యేసరికి చిత్ర పరిశ్రమలో తనకు చాలా చెడ్డ రూమర్స్ క్రియేట్ అయ్యాయని ఆయన తెలిపారు.అప్పటికీ చిరంజీవికి అంత పెద్ద హిట్స్ ఏం లేదు.కాబట్టి తాను కావాలనే అక్కడికి రాలేదని ఆయన కూడా నమ్మినట్టు కోటి చెప్పారు.
ఆ తర్వాత చిరంజీవి గారిని కలిసేందుకు వెళ్లినా ఆయన తనతో మాట్లాడే పరిస్థితుల్లో లేరని ఆయన చెప్పారు.తన ప్లేస్లో వేరొక మ్యూజిక్ డైరెక్టర్ను కూడా పెట్టుకున్నారని, నిజంగా చెప్పాలంటే ఆయనే కాదు, వేరొకరైనా అలాగే రియాక్ట్ అవుతారని ఆయన చెప్పారు.తనకు కారణముండి వెళ్లలేకపోయానని, కానీ ఎవరో ఆయనకు లేనిపోనివి చెప్పి అలా చేశారని కోటి తెలిపారు.
హిట్లర్ సినిమా తర్వాత మళ్లీ చిరంజీవితో ఏ సినిమాను కలిసి చేయలేదని, ఆ ఫంక్షన్ మా ఇద్దరిని విడదీసి ఉందని ఈ సందర్భంగా కోటి తెలియజేశారు.