యువ హీరోల్లో తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకుంటూ ప్రత్యేకమైన సినిమాలు చేస్తూ వస్తున్న హీరోల్లో శ్రీ విష్ణు ఒకరు.కొత్త వారితో లిమిటెడ్ బడ్జెట్ తో శ్రీ విష్ణు చేస్తున్న సినిమాలు మంచి ఫలితాలను అందిస్తున్నాయి.
ఈమధ్యనే రాజ రాజ చోర సినిమాతో హిట్ అందుకున్న శ్రీ విష్ణు లేటెస్ట్ గా అర్జున ఫల్గుణ సినిమాతో రాబోతున్నాడు.ఈ సినిమాను తేజా మార్ని డైరెక్ట్ చేస్తున్నారు.
మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు.
సినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
నాది కాని కురుక్షేత్రంలో నాకు తెలియని పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాను.అయినా బలవ్వడానికి అభిమన్యుడిని కాదు అర్జునుడిని అంటూ శ్రీ విష్ణు చెప్పిన మాస్ డైలాగ్ అదిరింది.
ఇన్నాళ్లు యాక్షన్ విషయంలో కొద్దిగా వెనకడుగు వేసిన శ్రీ విష్ణు అర్జున ఫల్గుణ సినిమాతో ఆ అటెంప్ట్ కూడా చేస్తున్నాడు.టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
టీజర్ చూస్తుంటే అర్జునా ఫల్గుణ శ్రీ విష్ణుకి మంచి ఫలితాన్ని అందిస్తుందనే అనిపిస్తుంది. అర్జున ఫల్గుణ సినిమాలో శ్రీ విష్ణు సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాతో పాటుగా శ్రీ విష్ణు మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి.