ఏపీ తెలంగాణాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు అధికారులు.ఇందులో తెలంగాణ విషయానికి వస్తే.
తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉన్నాయి.ఈ పదవులకు ఈ నెల 16న నోటిఫికేషన్ ఇచ్చిన అధికారులు అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ కూడ జరుగుతుందని వెల్లడిస్తున్నారు.
ఈ నెల 23 వ తేదీన నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనుంది.ఇక నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీగా అదే నెల 26 వ తేదీని నిర్ణయించారు.
అయితే వచ్చే నెల 14న పోలింగ్, 17న కౌంటింగ్ ఉండనుందని అధికారులు వివరించారు.
ఇదిలా ఉండగా ఏపీ విషయానికి వస్తే రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
కాగా ఫిబ్రవరి నెల 14వ తేదీన తూగో-పగో, కృష్ణా-గుంటూరు జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఇక నామినేషన్ల స్వీకరణ ఈ నెల 16న మొదలవనుంది.
చివరి గడువు ఈ నెల 23వ తేదీ వరకు ఉండనుంది.కాగా అధికారులు ఈ నెల 26న నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు.
వచ్చే నెల 14న పోలింగ్, 17న కౌంటింగ్ తో ఈ ఎన్నికల హడవుడి ముగియనుందని వెల్లడించారు.