టీఆర్ఎస్ అధినేత ఓ సరికొత్త వ్యూహాంతో ముందుకు వెళ్తున్నాడు.రాజకీయంగా తనకు శత్రువులు లేకుండా చేసుకుంటూ… తమకు బద్ద శత్రువులుగా ఉన్న ముఖ్యమైన నాయకులందరిని టీఆర్ఎస్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
దీనిలో భాగంగానే… కాంగ్రెస్నేత ఒంటేరు ప్రతాప్రెడ్డి చేరుతున్నారన్న వార్త తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.అసలు ఇదెలా సాధ్యమవుతోంది.
అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
ఒంటేరుని టీఆర్ఎస్ లోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది.మొదట ఎమ్మెల్సీని చేసి అనంతరం ఒంటేరుకు మంత్రి పదవి ఇస్తామని గులాబీ బాస్ నుంచి స్పష్టమైన హామీ రావడంతో ఆయన కారెక్కడానికి సిద్ధమైపోయారట.అయితే ఆయనకు వ్యవసాయ శాఖ ఇవ్వొచ్చు అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.