రాజకీయ నాయకురాలిగా, నటిగా నుస్రత్ జహాన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.2019 సంవత్సరంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసిన నుస్రత్ జహాన్ ఆ ఎన్నికలలో ఎంపీగా విజయం సాధించడం గమనార్హం.పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో జన్మించిన నుస్రత్ జహాన్ భవానీపూర్ కాలేజ్ నుంచి కామర్స్ బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు.
2010 సంవత్సరంలో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ నటి 2011 సంవత్సరంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.పోత్రు సినిమా ఈమె నటించిన తొలి సినిమా కాగా ఆ తర్వాత 20కు పైగా సినిమాలలో నుస్రత్ జహాన్ నటించడం గమనార్హం.2019 ఎన్నికల్లో 3,50,369 ఓట్ల మెజారిటీ సాధించి నుస్రజ్ జహాన్ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకోవడం గమనార్హం.గత కొన్నేళ్లుగా నుస్రత్ జహాన్ వ్యక్తిగత జీవితం ద్వారా వార్తల్లో నిలిచారు.
టర్కీలో నిఖిల్ జైన్ అనే ప్రముఖ బిజినెస్ మేన్ ను మ్యారేజ్ చేసుకున్న నుస్రత్ జహాన్ టర్కీలో తమ మ్యారేజ్ జరిగిందని అయితే ఆ మ్యారేజ్ ఇండియాలో చెల్లదని చట్టప్రకారం నిఖిల్ కు విడాకులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు.తనకు నిఖిల్ జైన్ కు మధ్య ఉన్న బంధం సహజీవనం మాత్రమేనని నుస్రత్ జహాన్ కామెంట్లు చేశారు.అయితే నుస్రత్ జహాన్ బిడ్డతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
నుస్రత్ జహాన్ మరో నటి యశ్ దాస్ గుప్తాతో కలిసి ఫోటోలు దిగగా ఆ ఫోటోలను సైతం ఆమె అభిమానులతో పంచుకున్నారు.కొన్ని రోజులుగా నుస్రత్ కు యశ్ దాస్ గుప్తాకు పెళ్లి జరిగిందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఆ వార్తల గురించి స్పందించడానికి నుస్రత్ జహాన్ ఇష్టపడటం లేదు.
నుస్రత్ పెళ్లి గురించి అధికారికంగా ఎప్పుడు స్పష్టత ఇస్తారో చూడాల్సి ఉంది.