టాలీవుడ్ యంగ్ హీరోల్లో నాగ శౌర్య ఒకరు.ఇటీవలే ఆయన ఫార్మ్ హౌస్ మీద దాడులు జరిగిన విషయం తెలిసిందే.
ఆయన ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్న 20 మంది ముఠాను పోలీసులు పట్టుకుని భారీ నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.ఇక ఈ కేసు ఎన్నో మలుపులు తిరుగుతూ సంచలనం సృష్టిస్తుంది.
తాజాగా ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది.
నాగ శౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ ని మంచిరేవుల పేకాట కేసులో పోలీసులు అరెస్ట్ చేసారు.ఆయనను ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరిచారు.నాగ శౌర్య తండ్రికి గతంలో పోలీసులు రెండు సార్లు నోటీసులు జారీ చేసిన కూడా పట్టించుకోలేదు.
దీంతో ఈ రోజు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.ఫామ్ హౌస్ పేకాట కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడిగా గుత్తా సుమన్ పేరు వినిపించింది.
ఈయనే నాగ శౌర్య ఫామ్ హౌస్ లో పేకాట ఆడిస్తున్నాడని విచారణలో తేలింది.అయితే ఈయనతో పాటు మరొక వ్యక్తి కూడా ఈ పేకాట కేసులో ఉన్నట్టు పోలీసులు అనుమానం రావడంతో ఈ కేసుపై మరింత ద్రుష్టి పెట్టి విచారణ చేపట్టారు.
దీంతో విచారణలో ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చిందట.ఈ కేసులో గుత్తా సుమన్ తో పాటు మరొక వ్యక్తి ఉన్నట్టు తెలిసింది.
నాగ శౌర్య తండ్రి ఈ పేకాట కేసులో మరొక ప్రధాన నిందితుడు అని ఈ మొత్తం పేకాట దందాలో నాగ శౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ పాత్ర కూడా ఉన్నట్టు పోలీసులకు అధరాలు దొరికాయి.అందుకే ఆయనను ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.ఇక ఇప్పుడు ఈ పేకాట కేసు కీలక మలుపు తిరిగిందని చెప్పాలి.మరి చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో.