తెలంగాణ లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకుండా ఏర్పడిన మహాకూటమి కాంగ్రెస్ పాలిట శాపం అయ్యిందని… ముఖ్యంగా అందులో ఉన్న తెలుగుదేశం పార్టీ వల్ల కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతింది అని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు బహిరంగంగా విమర్శించడం రాజకీయ సంచలనం సృష్టిస్తోంది.టీడీపీతో పొత్తు కారణంగా ఏ టికెట్ ఎవరికి వస్తుందో తెలియదు, ఏ బీఫామ్ ఎవరికి పోయిందో తెలియని పరిస్థితులు తలెత్తాయని.
దీంతో ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన చెందుతున్నారు.కేసీఆర్ ఎంత గోల్మాల్ చేసినా కాంగ్రెస్ కచ్చితంగా 45 నుంచి 50 సీట్లు గెలుస్తుందని తాను అనుకున్నానని, కానీ కాంగ్రెస్ ఇంత ఘోరంగా ఓడిపోతుందని అస్సలు ఊహించలేదన్నారు.
టీడీపీతో పొత్తు వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామని అన్నారు.తనలాంటి వాళ్ల ఓటమికి టీడీపీతో పొత్తే కారణం అన్నారు.మహాకూటమి వద్దని తాను ముందే చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు.కూటమి గెలిస్తే తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు ప్రాధాన్యత పెరుగుతుందన్న టీఆర్ఎస్ మాటలను ప్రజలు నమ్మారని చెప్పారు.
అధిష్టానం టికెట్ ఇస్తే పార్లమెంటుకు పోటీ చేస్తానని కోమటిరెడ్డి తెలిపారు.