నటుడిగా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బండ్ల గణేష్ ( Bandla Ganesh ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బండ్ల రాజకీయాలలోకి కూడా వచ్చి రాజకీయాలలో కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారు.
అయితే ఈయన ఎక్కడ ఉన్నా కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారనే విషయం మనకు తెలిసిందే.బండ్ల గణేష్ ఏ విషయం గురించి మాట్లాడిన ముక్కుసూటిగా తనకు తోచినది మాట్లాడుతూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తుంటారు.
ఇలా సోషల్ మీడియా వేదిక ఈయన చేసే ట్వీట్లు కొన్నిసార్లు వివాదానికి కూడా కారణం అవుతుంది.
గతంలో రాజకీయాలలో చాలా చురుగ్గా పాల్గొన్నటువంటి బండ్ల గణేష్ అనంతరం రాజకీయాలకు దూరమయ్యారు.రాజకీయాల ( Politics ) గురించి మాట్లాడుతూ తను రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పబోతున్నానని తెలియజేశారు.అయితే మరోసారి బండ్ల గణేష్ రాజకీయాల గురించి ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా బండ్ల గణేష్ రాజకీయాల గురించి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ.రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.కాసేపటికే నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా, ధైర్యంగా పౌరుషంగా, రాజకీయాలు చేస్తానంటూ ఈయన ట్వీట్ చేశారు.
ఈ విధంగా బండ్ల గణేష్ తిరిగి రాజకీయాలలోకి రాబోతున్నాను అంటూ ఈ సందర్భంగా చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.బానిసత్వానికి బై బై.నిజాయితీతో కూడిన రాజకీయాలకు జై జై.రాజకీయాలంటే నిజాయితీ.రాజకీయాలంటే నీతి… రాజకీయం అంటేనే కష్టం అంటూ ఈయన రాజకీయాల గురించి ట్విట్ చేశారు.
అయితే ఈయన రాజకీయాలలోకి వస్తే ఏ పార్టీకి మద్దతు తెలుపుతారనే విషయం తెలియాల్సి ఉంది.ఇలా బండ్ల గణేష్ రాజకీయాల గురించి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
గతంలో మాదిరిగా ఈయన కాంగ్రెస్ పార్టీ( Congress Party )కి మద్దతు తెలుపుతారా లేక పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జనసేన పార్టీ(Janasena Party) కి మద్దతు తెలుపుతారా అనే విషయం తెలియాలి.