గురజాడ అప్పారావు 160వ జయంతి వేడుకలు

కీర్తిశేషులు మహాకవి శ్రీ గురజాడ అప్పారావు 160వ జయంతి సందర్భంగా ఆయన నివాసంలో చిత్రపటానికి పూలమాలల వేసి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి నివాళులు అర్పించారు.అనంతరం ఇంటి వద్ద నుంచి సత్య కాలేజ్ జంక్షన్ వద్ద గురజాడ విగ్రహం వరకు సంగీత కళాశాల సిబ్బంది, విద్యార్థులతో పాడుకుంటూ ర్యాలీగా వెళ్లి అక్కడ ఘన నివాళులు అర్పించారు.

 Gurajada-apparao-birthday-celebratations-at-vizianagaram-TeluguStop.com

మహాకవి గురజాడ అప్పారావు పుట్టిన ఈ విజయనగరం లో జిల్లా వాసులుగా ఉన్నందుకు గర్వపడుతున్నాం అని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అన్నారు.ఒక గొప్ప కవిగానే కాకుండా కన్యాశుల్కం వంటి గొప్ప రచనలతో సమాజంలో మార్పులు కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, “దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్” అనే కవిత్వాన్ని మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ప్రపంచంలో అన్ని దేశాలు ఈ కవిత్వాన్ని ఎప్పటికీ గుర్తుంచుకునేలా రాసిన గురజాడ అప్పారావుని రాబోయే తరాలు కూడా ఆయన స్ఫూర్తిని తెలియజేసే విధంగా కృషి చేయాలని అందరికీ విజ్ఞప్తించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ కోట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు, నగర మేయర్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube