సిరిసిల్ల జిల్లాలో ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ

రాజన్న సిరిసిల్ల జిల్లా :రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో ఆదివారం కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గా( Vemulawada Assembly Constituency )ల కు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వేదికగా నిర్వహించారు.

 Calm Counting Process In Sirisilla District-TeluguStop.com

కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి( Anurag Jayanti ) ఆదేశాల మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా సాగింది.జిల్లా కలెక్టర్ ఎప్పటికపుడు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ను పర్యవేక్షించగా , జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

పకడ్బందీ కార్యచరణతో కలెక్టర్,ఎస్పి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంచనీయ ఘటనలు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా చూశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube