సిరిసిల్ల జిల్లాలో ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ

రాజన్న సిరిసిల్ల జిల్లా :రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో ఆదివారం కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.

జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గా( Vemulawada Assembly Constituency )ల కు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వేదికగా నిర్వహించారు.

కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి( Anurag Jayanti ) ఆదేశాల మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా సాగింది.

జిల్లా కలెక్టర్ ఎప్పటికపుడు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ను పర్యవేక్షించగా , జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

పకడ్బందీ కార్యచరణతో కలెక్టర్,ఎస్పి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంచనీయ ఘటనలు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా చూశారు.

కొండ సురేఖ వివాదం .. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి విన్నపం