తెలుగులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఏక్ నిరంజన్ చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు తన నటించిన చిత్రాలతో కంటే ఎక్కువగా వివాదాలతోనే బాగా పాపులర్ అవుతోంది.
కాగా బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకొని మరణించడంతో సినిమా ఇండస్ట్రీ లో ఉన్నటువంటి బంధుప్రీతి మరియు నేపోటిజం వంటి వాటి పై సంచలన వ్యాఖ్యలు చేసింది.దీంతో అప్పటి నుంచి సోషల్ మీడియా మాధ్యమాలను వేదికగా చేసుకొని బాలీవుడ్ సినీ ప్రముఖులపై విరుచుకుపడుతోంది.
అయితే తాజాగా ట్విటర్ సంస్థ అధికారులు కంగనారనౌత్ అధికారిక ట్విట్టర్ ఖాతా ని సస్పెండ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలిపారు.ఇందులో భాగంగా గత కొద్ది రోజులుగా నటి కంగనా రనౌత్ సినీ సెలబ్రిటీల పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు అభిమానుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ట్వీట్లు చేస్తోందని అందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
దీంతో కొందరు కంగనా రనౌత్ అభిమానులు ట్విట్టర్ సంస్థ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా గత కొద్ది రోజులుగా నటి కంగనా రనౌత్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్నటువంటి నెపోటిజం ను అరికట్టేందుకు ప్రయత్నిస్తోందని అందువల్లనే కొందరు సినీ సెలబ్రిటీలు నటి కంగనా రనౌత్ పై ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని కామెంట్లు చేస్తున్నారు.
కానీ ఇప్పటివరకు కంగనారనౌత్ మాత్రం తన అధికారిక ట్విట్టర్ ఖాతా సస్పెన్షన్ విషయంపై స్పందించలేదు.
ఈ విషయం ఎలా ఉన్నది ఇటీవలే నటి కంగనా రనౌత్ తలైవి అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించింది దీంతో ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, తదితర భాషలలో విడుదల చేయగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.అంతేకాకుండా ఈ చిత్రంలో కంగనా రనౌత్ నటనకి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందాయి.కాగా ప్రస్తుతం ధాకడ్ అనే చిత్రంలో నటిస్తోంది.