యోగా వల్ల ఎన్నో ఉపయోగాలో ఇండియన్స్ అందరికి తెలుసు.కాని ఇండియన్స్ కంటే ఇతర దేశస్తులు యోగాను ఎక్కువగా చేస్తున్నారు.
మన యోగాను ప్రస్తుతం అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో ప్రముఖంగా అవలంబిస్తున్నారు.కొన్ని వేల సంఖ్యల్లో అమెరికాలో యోగా సెంటర్లు పడుతున్నాయి అంటే యోగాకు ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి.
ప్రతి ఒక్కరు యోగా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటూ యోగా గురువులు చెబుతున్నారు.అయిదు సంవత్సరాల పిల్లాడి నుండి ముసలి వారి వరకు కడూ యోగా ఆసనాలు ఉన్నాయి.

యోగా ఆసనాల్లో కీలకమైన ఆసనం పద్మాసనం.ఈ ఆసనం అన్ని ఆసనాల్లోకి చాలా సులువైనది మరియు చాలా ప్రయోజనాలు కలిగి ఉన్నది.ఈ ఆసనం వేసేందుకు పెద్దగా కష్టం ఏమీ లేదు.సుఖంగా కూర్చోవడమే పద్మాసనం అంటారు.మనం వాడుక భాషలో సైకలముకలం పెట్టుకోవడం అంటాము.చిన్న పిల్లలను అలా కూర్చోబెట్టడంకు కారణం కూడా అదే అంటూ యోగా గురువులు అంటున్నారు.
వారిలో రక్త ప్రసరణ ఎక్కువ జరిపేందుకు వారిని అలా కూర్చోబెట్టాలని అంటున్నారు.

ఇక ఫొట్లో చూపించిన విధంగా నిటారుగా కూర్చుని ఒక కాలి తొడపైకి మరో కాలి పాదంను పెట్టుకుని రెండు చేతులను ఒక అర చేతిలో మరో అరచేయి పెట్టి కూర్చోవాల్సి ఉంటుంది.అలా కూర్చున్న సమయంలో శరీరంలోని రక్త ప్రసరణ చాలా స్పీడ్గా జరుగుతుంది.రక్త నాళాల్లో ఉన్న మళినాలు మూత్రశయంలోకి చేరుతాయి.
శరీరంలోని మలినాలను తొలగించేందుకు పద్మాసనం చాలా బాగా ఉపయోగపడుతుంది.

పద్మాసనం వల్ల వెన్ను నొప్పి ఉన్న వారు, మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు ఉపశమనం పొందవచ్చు.ప్రతి ఒక్కరు కూడా ఈ ఆసనంతో లాభం పొందుతారు.గర్బవతులు కూడా అయిదు లేదా ఆరు నెలల వరకు ఈ ఆసనంను వేయడం వల్ల ప్రయోజనం పొందుతారు.
లావు ఎక్కువ ఉన్న గర్బవతులు ఈ ఆసనం వేయక పోవడం మంచిది.ప్రతి ఒక్కరికి ఉపయోగదాయకమైన ఈ ఆసనంను రేపటి నుండి వేస్తారని ఆశిస్తున్నాం.యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి.ఈ విషయాన్ని నలుగురితో షేర్ చేసుకోండి.